గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆ తరవాత వెంటిలేటర్తో పాటు ఎక్మో (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్తో చికిత్స చేశారు. గత 40 రోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్పీ బాలు. ఇక బాలుకు భార్య సావిత్రి, కూతురు పల్లవి, కొడుకు ఎస్. పి. చరణ్ ఉన్నారు. కొడుకు ఎస్. పి. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహమాడింది. బాలు మృతి సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
previous post
తాజ్ మహల్ ఒక సమాధి… ప్రపంచ వింతకాదు… రంగోలి రనౌత్ కామెంట్స్