ప్రముఖ నటి మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది . మీనా భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడిన విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
జనవరిలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది. ఆ తర్వాత నుంచి శ్వాసకోశ సమస్య తీవ్రమైంది. ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు ట్రాన్స్ ప్లాంటెషన్ చేయాల్సి ఉండగా.. డోనర్ లేక వాయిదా పడుతోందని.. దానికి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయం లభిస్తే చేయాలని భావించారు .అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు
బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విద్యాసాగర్ను మీనా 2009లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. ఇటీవల మీనా.. దృశ్యం 2 సహా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోవైపు ఆమె కుమార్తె నైనిక కూడా కొన్నాళ్ల క్రితం తళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘థేరీ’ చిత్రంతో అరంగేట్రం చేసింది.