“క్షణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడవి శేష్. లిమిటెడ్ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకు ప్రశంసలను అందుకుని మంచి హిట్ సినిమాగా నిలిచింది “క్షణం”. ఇప్పుడు మరోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేషన్లో ఓ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రానికి “ఎవరు” అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను ఈద్ సందర్భంగా విడుదల చేశారు. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. క్షణం, గూఢచారి సినిమాలతో సూపర్డూపర్ హిట్స్ను సాధించిన అడివిశేష్ హీరోగా నటిస్తుండగా, రెజీనా కసండ్ర హీరోయిన్గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 23న విడుదల చేయనున్నారు.
తాజాగా “ఎవరు” చిత్రంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర కథ కాపీ అంటూ ప్రచారం జరుగుతోంది. స్పానిష్ సూపర్ హిట్ చిత్రం “ది ఇన్విజిబుల్ గెస్ట్” ఆధారంగా “ఎవరు” చిత్రం తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారనేది లేటెస్ట్ టాక్. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం స్పందించలేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “బద్లా” మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించింది. బద్లా చిత్రం “ది ఇన్విజిబుల్ గెస్ట్”కు రీమేక్.
పదిహేనేళ్ల క్రితం నుంచే ఆలియా అంటే ఇష్టం : రణబీర్ కపూర్