గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఉత్కంఠకు నిన్నటితో తెర పడింది. నువ్వా నేనా అంటూ సాగిన మా అధ్యక్ష పోరులో చివరికి అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమిపాలైన ప్రకాష్ రాజ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఒ క కాళాకారుడుగా నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుందని..అందువల్ల మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను తెలుగువాడిని కాదని.. అతిధిగా వచ్చాను.. అతిధిగానే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.
” ‘మా’ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎప్పడు లేనంత ఒక చైతన్యంతో..దాదాపు 650 మంది ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. గెలిచిన ప్రతిఒక్కరికీ పేరు పేరునా అభినందనలు తెలిపారు. ప్రాంతీయ, జాతీయవాదం నేపథ్యంలో ఎలక్షన్ జరిగిందని అన్నారు. ఏం చేయాలి నా తల్లి దండ్రలు తెలుగువారు కాదు..కాని అది నా తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదని ఉద్వేగంతో మాట్లాడారు.
తెలుగుబిడ్డను, తెలుగువాడిని మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నా. అతిథిగా వస్తే అతిథిగా ఉండాలనే చాలామంది చెప్పారు. అందుకే అతిథిగానే ఉండాలని నిర్ణయించుకున్నా అని అన్నారు.
ఇది భాదతో చేసిన నిర్ణయం కాదు..సీనియర్ నటులైన మోహన్బాబు గారు, కోట శ్రీనివాసురావుగారు, చలపతిరావు కుమారుడు రవి కుమార్ వీళ్ళందరూ ఓపెన్గా చెప్పారు. అదే జరిగింది ఇప్పడు..జాతీయ వాదం వచ్చింది..బీజేపీ నేతలు కూడా కొంతమంది ట్వీట్ చేస్తూ అభినందనలు తెలిపారు.