గతేడాది టైడెంట్ ఆర్ట్స్ పతాకంపై సుందర్ సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా నటించిన చిత్రం “యాక్షన్”. నవంబర్లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.ముందుగా యాక్షన్ సినిమాను తక్కువ బడ్జెట్లో తెరకెక్కించాలని నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా కనీసం రూ.20 కోట్లు వసూలు చేయకపోతే ఆ నష్టాన్ని తను భరిస్తానని విశాల్ నిర్మాతలకు చెప్పడంతో చివరికి రూ.44 కోట్లతో యాక్షన్ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో తమిళనాడులో రూ.7.7 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రూ. 20 కోట్లు వసూలు చేయడంలో విఫలమవడంతో నష్ట పరిహారాన్ని పూడ్చేందుకు తన తరువాత చిత్రం ‘చక్ర’ను ట్రైడెంట్ బ్యానర్పైనే నిర్మిస్తానని విశాల్ నిర్మాతలకు మాటిచ్చాడు. కానీ ప్రస్తుతం ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యాన్లో నిర్మించారని, చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ యాక్షన్ సినిమా నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు యాక్షన్ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు విశాలే డబ్బులు చెల్లించాలని తీర్పునిచ్చింది. అలాగే చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అనుమతినిచ్చింది.
previous post