మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన “చిత్రలహరి” ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ తో సాయిధరమ్ తేజ్ చేస్తున్న తర్వాత చిత్రం “ప్రతిరోజు పండగే”. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. “ప్రతిరోజు పండగే” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సరికొత్త లుక్లో తేజూ కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే చిత్ర బృందం అమెరికా వెళ్లనున్నారు. అమెరికా షెడ్యూల్లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అక్టోబర్ 15న హీరో సాయి తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి తేజ్కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రయూనిట్ ప్రత్యేకమైన టీజర్ను విడుదల చేయనున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. హీరో సాయి తేజ్, సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో మనసుల్ని చూరగొన్నారు. ఇక దర్శకుడు మారుతి… హీరో సాయి తేజ్ను కొత్త రకమైన పాత్ర చిత్రణతో, న్యూ లుక్లో చూపించబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని ఎమోషనల్గా చిత్రీకరించనున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్టైన్మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉండబోతుందట.
previous post