బాలీవుడ్ స్టార్స్ రణ్బీర్ కపూర్- ఆలియా భట్ ఏప్రిల్ 14న ఈ క్యూట్ కపుల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బాంద్రాలోని రణబీర్ ఇంట్లో అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది.
పెళ్లైన రెండు రోజుల్లోనే తిరిగి సెట్స్లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశారు. పెళ్లి తర్వాత లైఫ్ ఏమైనా మారిందా? అన్న ప్రశ్నకు తాజాగా రణ్బీర్ ఇలా స్పందించాడు.పెళ్లయినప్పటి నుంచి తాము చాలా బిజీగా ఉన్నామని చెప్పాడు.ఐదేళ్లు కలిసి ఉన్నందున పెళ్లి తర్వాత తమ జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదని కూడా చెప్పాడు.
కానీ ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్ట్లు ఇంకా పెండింగ్లో ఉండటంతో మొదట వాటిని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టామని, పెళ్లైన తర్వాతి రోజే మేం షూటింగ్స్తో బిజీ అయ్యాం. అలియా తన మూవీ షూటింగ్లో నేను మనాలీలో నా సినిమా షూటింగ్లో ఉండిపోయామని అన్నారు.
అలియా తన హాలీవుడ్ మూవీ షూటింగ్ ముగించుకుని లండన్ నుంచి ఎప్పుడైతే తిరిగొస్తుందో అప్పుడు మేము కొంత బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాం. అది కూడా నేను నటించిన షంషేరా మూవీ రిలీజయ్యాకే ఏదైనా హాలీడే ట్రిప్ ప్లాన్ చేస్తాం. ప్రస్తుతానికైతే మాకింకా పెళ్లి కానట్లే అనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు రణ్బీర్. కాగా షంషేరా జూలై 22న రిలీజ్ కానుండగా రణ్బీర్ దంపతులు నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న విడుదల కానుంది.