రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం టీడీపీకి లేదన్నారు. అయినప్పటికీ ఆ పార్టీ దళితుడైన వర్ల రామయ్యను బరిలోకి దించారని మండిపడ్డారు.చంద్రబాబు తన రాజకీయాల కోసం వర్ల రామయ్యను బలిపశువును చేశారని విమర్శించారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత చంద్రబాబు కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు క్యాష్ ముఖ్యమని భావించిన చంద్రబాబు… ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు. రాజ్యసభ సీటును గెలిచే అవకాశం ఉంటే క్యాష్ ను చూస్తారని, లేనప్పుడు క్యాస్ట్ ను చూస్తారని దుయ్యబట్టారు. రాజ్యసభ టికెట్ ను దళితులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అన్ని కులాలకు న్యాయం చేసింది జగన్ మాత్రమేనని రోజా పేర్కొన్నారు.