ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం జగన్ కుట్రలో భాగమని చెప్పారు.
అచ్చెన్నాయుడును ఎక్కడకు తీసుకెళ్తున్నారో, ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా తెలియదని అన్నారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు. దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోనులో మాట్లాడదామనుకుంటున్నప్పటికీ ఆయనను అందుబాటులో లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు.