తెలంగాణలో కరోనా వైరస్ క్రమంగా ఊపందుకుంటోన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం మరో 33 మందికి కరోనా వైరస్ సోకింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో ఏడుగురు వలస కూలీలు వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,196కి చేరింది. ప్రస్తుతం 415 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 30 మంది కరోనా వల్ల చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని 751 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇటీవల కొన్నిరోజుల పాటు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడంతో కట్టడి చర్యలు ఫలితాలనిస్తున్నాయని భావించారు. అయితే, గత కొన్నిరోజులుగా నిత్యం పెద్ద సంఖ్యలో కేసులు నమోదువుతుండడం, అది కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికులకు కరోనా నిర్ధారణ అవుతుండడం అధికార వర్గాలను కాస్తంత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
బీజేపీ ఎంపీ సోయం మాట తప్పారు: ఎమ్మెల్యే జోగు రామన్న