దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాతే కారణమని ఆరోపణలు వెల్లువిరుస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. కరోనా వైరస్ బారినపడడం నేరమేమీ కాదని, కానీ వైరస్ సోకినా దాచి ఉంచడమే అసలైన నేరమని స్పష్టం చేశారు. ఆ విధమైన నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవన్నారు.
తబ్లిగీ జమాత్ తో సంబంధం ఉన్నవాళ్లు ఈ తరహా నేరానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో తబ్లిగీ జమాత్ పాత్ర ఖండించదగినదని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ కరోనా వ్యాప్తి వెనుక తబ్లిగీ జమాత్ ఉందన్నారు. ఉంది.కరోనాను దాచి పెట్టకుండా ఉంటే కరోనా మరింత మందికి సోకకుండా నివారించగలిగే వాళ్లమని పేర్కొన్నారు.
శ్రీవారి లడ్డూతో వ్యాపారం చేయడం తప్పు: రమణ దీక్షితులు