telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సెక్రటేరియట్ కూల్చివేతపై సుప్రీంకోర్టులో రేవంత్ పిటిషన్

Revanth-Reddy mp

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సచివాలయాన్ని కూల్చి నూతన భావన నిర్మాణం అంటే ప్రజాధనం వృథా చేయడమేనని పేర్కొంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాంతో హైకోర్టు నిర్ణయంపై రేవంత్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కేసీఆర్ సర్కారు సచివాలయం కూల్చివేతకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న రేవంత్ రెడ్డి దీనిపై తీవ్రపోరాటం చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బృందాన్ని కూడా కలిసి తన వాదనలు వినిపించారు. హుస్సేన్ సాగర్ ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో ఎలాంటి శాశ్వత కట్టడాలకు అనుమతి ఇవ్వరాదని 2001లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అప్పటినుంచి శాశ్వత నిర్మాణాలకు ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేయడంలేదని ఎన్జీటీకి వివరించారు. 

Related posts