`గీతగోవిందం` వంటి బ్లాక్బస్టర్ విజయం తర్వాత తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయడానికి సిద్ధమవుతున్నాడు పరశురామ్. వాస్తవానికి ఈ సినిమాకంటే ముందుగా ఆయన నాగచైతన్యతో 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ‘నాగేశ్వర రావు’ సినిమా చేయవలసి వుంది. ఈ లోగా మహేశ్ బాబు నుంచి పిలుపు రావడంతో, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి ఆయన ఇటువైపు వచ్చేశాడు. పరశురామ్ ఈ విధంగా చేయడం పట్ల నాగార్జున కోపంగా ఉన్నారనీ, ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్టేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ ప్రచారంపై తాజాగా పరశురామ్ స్పందిస్తూ .. చైతూతో నేను చేయవలసిన సినిమా ఆగిపోలేదు. మహేశ్ బాబుతో సినిమా పూర్తయిన తరువాత, ‘నాగేశ్వరరావు’ పట్టాలెక్కుతుంది. చైతూ కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుంది. అక్కినేని ఫ్యామిలీతో నాకు సన్నిహిత సంబంధాలు వున్నాయి. నాపై నాగార్జునగారికి కోపం వచ్చిందనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు అని చెప్పుకొచ్చాడు.
previous post