కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండుటెండల్లో వాహనదారులను ఆపి చలాన్లు రాస్తున్న పోలీసులపై మండిపడ్డారు. హైదరాబాదులోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహదారులను ఆపి, చలాన్లు వేస్తున్న సందర్భంలో… అటువైపుగా వీహెచ్ వెళ్తున్నారు.
అక్కడే వాహన దారులకు అధికారులు రాస్తున్న చలాన్ల వ్యవహరాన్ని గమనించిన ఆయన… కారు నుంచి దిగి, మొదట వాహనదారులతో మాట్లాడారు. ఆ తర్వాత పోలీసులపై ఫైర్ అయ్యారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, జనాలను ఎందుకు పరేషాన్ చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే అందరినీ పంపిచేయాలని గదమాయించారు. అంతేకాదు, దగ్గరుండి వాహనదారులను పంపించేశారు.
వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స