telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

శ్రీశ్రీ మాటలు మానవాళికి దిక్సూచి: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) మాటలు మానవాళికి ఎప్పుడూ దిక్సూచిలా పనిచేస్తాయనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విటర్ లో పేర్కొన్నారు. శ్రీశ్రీ 109వ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేశారు. నిన్నటిలో జీవించటం మానేసి రేపటి గురించి ఆలోచించమనే కార్యాలను ఏ గంధర్వులూ తీర్చలేరు. మనమే కాలాన్ని మధురాతి మధురంగా తీర్చి దిద్దుకోవాలని పేర్కొన్నారు.

ఆర్ధిక జీవితములోని ఆగణిత విశ్వాసముతో ప్రగతి బాట పయనించగ కదలి రండి.. అని పిలుపిచ్చిన మహకవి శ్రీశ్రీ అని కొనియాడారు. వ్యక్తికి బహువచనం శక్తి అన్న ఆయన మాటలు మనందరం ఆచరించి, మరింత శ్రమించి మన లక్ష్యాలు చేరుకోవటానికి దోహదపడుతాయని నా నమ్మకం’ అంటూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

Related posts