telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

కంగనా రనౌత్ : ఇంకా ఎన్ని ఇళ్లపై దాడులు చేస్తారు?

ఈ రోజు ఉదయం రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే 2018లో నమోదైన ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఆయనను అరెస్టు చేశారు. అర్నబ్ పై సెక్షన్ 306పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం పోలీసులు అర్నబ్ నివాసంపై దాడులు నిర్వహించారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్నబ్ గోస్వామి అరెస్ట్ పై బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ స్పందిస్తూ.. ”అర్నబ్ గోస్వామి ఇంటిలోకి దూసుకెళ్లి ఆయనపై దాడి చేసి.. జుట్టు పట్టుకొని లాగడంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడగాలని అనుకొంటున్నాను. మీరు ఎన్ని ఇళ్లపై దాడులు చేస్తారు? ఇంకా ఎన్ని గొంతులు నొక్కుతారు? ఎంతమందిని వేధిస్తారు? ఎంత మంది నోళ్లు మూయిస్తారు? సోనియా సేన ఎన్నాళ్లు ఇలాంటి దారుణాలు చేస్తారు? అన్యాయాలు అక్రమాలపై సోనియా సేన నోరు మూయించాలని ప్రయత్నిస్తే మరిన్ని గొంతులు పైకి లేస్తాయి. ఇంతకు ముందు ఎంతో మంది దేశభక్తులు గొంతులు కోసారు. ఎంతో మందికి ఉరితాళ్లు బిగించారు. అయినా మేము వెనుకడుగు వేయం. ఒక గొంతు నొక్కితే చూస్తే ఎన్నో గొంతులు లేస్తాయి” అంటూ కంగన రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related posts