లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు భారత పరిశ్రమల సమాఖ్య (సీసీఐ) తెలంగాణ చాప్టర్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కారణంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) సెక్టార్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
ఐటీ సంస్థలు, తెలంగాణలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించవద్దని ఆయా సంస్థల యాజమాన్యాలకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. త్వరలో ఈ సంక్షోభం నుంచి బయటపడతామని తాను నమ్ముతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని అన్ని రకాల ఉద్యోగులను తమ సంస్థల నుంచి తొలగించవద్దని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి: లోకేష్