telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గుజరాత్ లో చిక్కుకున్న మత్స్యకారులను ఆదుకోవాలి: పవన్ కల్యాణ్

pawan-kalyan

గుజరాత్ లో చిక్కుకుపోయిన 4 వేల మంది శ్రీకాకుళం మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

లాక్ డౌన్ కారణంగా గుజరాత్ తీర ప్రాంతాల్లో ఏపీకి చెందిన వేలమంది నిలిచిపోయారని, లాక్ డౌన్ పరిస్థితులను అర్థం చేసుకుని వారిని ఆదుకోవాలని పవన్ కోరారు. కనీసం సంబంధిత జిల్లా మంత్రులను కానీ, ఉన్నతాధికారులను కానీ గుజరాత్ పంపించి, మత్స్యకారులకు భరోసా ఇవ్వాలని సూచించారు. జాలర్లనురాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని తెలిపారు.

Related posts