ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, నిమ్మగడ్డలను విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. అయితే.. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ట్విట్టర్ వేదికగా నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ.. ఉల్లిగడ్డ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. “ప్రజలంతా ఏకమైతే నిమ్మగడ్డలు, ఉల్లిగడ్డలు వారి ముందెంత! చిత్తూరు, గుంటూరు ఏకగ్రీవాలపై రెండు రోజులు రంకెలేశాడు. మూడో రోజు డీలా పడ్డాడు. ప్రజా నిర్ణయమే అంతిమం, ఊరంతా ఏకమై అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకుంటే ఏ శక్తీ ఆపలేదు” అంటూ విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి.
previous post
next post