ఢిల్లీలోని సదస్సులో పాల్గొని తిరిగి రాష్ట్రానికి తిరిగివచ్చినవారికి కరోనా వైరస్ సోకిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. బుధవారం అమరావతిలో జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండురోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీసదస్సుకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ జ్వరం, ఫ్లూ లాంటిదే, ఎవరూ భయపడొద్దన్నారు. వృద్ధులు, డయాబెటిస్, ఇతర సమస్యలున్నవారికి తీవ్రంగా ఉంటుందన్నారు. కరోనా పట్ల అధైర్యపడొద్దు, ఆందోళన చెందవద్దన్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతుందని పేర్కొన్నారు.