telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కొత్తగా 6,751 కరోనా కేసులు

corona vairus

ఏపీలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో క్రమంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజు 6,133 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 6,751 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరుకుంది.

మరోవైపు గత 24 గంటల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,869కి పెరిగింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,577 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 57,858 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,36,508 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

Related posts