అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు అసత్యాలు చెబుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అలాగైతే జగన్ కట్టుకున్న ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కిందకు రాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం, రైతుల మధ్య ఒప్పందాన్ని గౌరవించాల్సిన బాధ్యత లేదా? అంటూ వైసీపీ సర్కారును ప్రశ్నించారు.
రాజధానికి లక్ష పదివేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఎవరన్నారంటూ నిలదీశారు. సంక్రాంతి సంబరాలు అమరావతి కేంద్రంగానే జరగాలని, జీఎన్ రావు, బీసీజీ నివేదికలు భోగి మంటల్లో తగలబడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఒకరి ఉన్మాదంతో ప్రజలు జీవితాంతం బాధపడాల్సి రావడం దారుణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణమే మూడు రాజధానుల నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పవన్ పై పోటీకీ నేను సిద్దం: కేఏ పాల్