నవంబర్ 3వ తేదీన ఆధ్యాత్మిక ప్రవచకులు, హిందూధర్మ ప్రచారకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురు సత్కారం చేయనున్నారు. దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లి పబ్లిక్గార్డెన్లోని లలితకళాతోరణంలో సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో చాగంటిని సత్కరించనున్నట్టు నిర్వాహకులు మరుమాముల వెంకటరమణశర్మ తెలిపారు. పూల పల్లకిలో చాగంటిని ఊరేగింపుగా తీసుకువచ్చి స్వర్ణకంకణం అలంకరించి గురుసత్కారం చేయనున్నారు. అలాగే ‘ధార్మికవరేణ్య’ బిరుదును, జీవనసాఫల్య పురస్కారం ప్రదానం చేసి సన్మానపత్రాన్ని సమర్పిస్తారు.
కార్యక్రమానికి ఆర్థికశాఖ మంత్రి హరీ్షరావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ఢిల్లీ తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్కే జోషి, పద్మభూషణ్ కోడూరు ఈశ్వరప్రసాద్రెడ్డి, మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నర్సింహారావు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వీఎ్సఆర్ మూర్తితోపాటు పలువురు అధికారులు, ధార్మికవేత్తలు హాజరుకానున్నారు.
ఆ ముగ్గురికి ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం: యామిని