తమిళనాడు లో పాడుబడ్డ సరస్సులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కంచీపురం జిల్లా అమ్మన్ కోయిల్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుడిని సూర్య(23)గా పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజుల నుంచి ఈ సరస్సును శుద్ధి చేస్తున్నారు. అయితే సూర్య అనే యువకుడు సరస్సును శుద్ధి చేసేందుకు కొన్ని పరికరాలు తీసుకువచ్చాడు. ఈ పరికరాలను తెరుస్తున్న క్రమంలోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కోడెలను టీడీపీ నేతలు ఎవ్వరూ పట్టించుకోలేదు: అంబటి