బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ డిజిటల్ ఫాంలోకి అడుగుపెడుతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. క్రైం నేపథ్యంలో సాగే తన వెబ్ సిరీస్కు సంబంధించిన అధికారిక టీజర్ను అనుష్క మంగళవారం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. త్వరలో అమెజాన్ ప్రైంలో తన వెబ్సిరీస్ ప్రసారం అవుతుందని కూడా చెప్పారు. స్క్రీన్పై రక్తం చిమ్ముతూ మొదలైన ఈ టీజర్. సమయం ఆసన్నమైంది. శాంతి భద్రతలను కొల్లగొట్టేందుకు చీడ పురుగుల్లాంటి మనుషులు భూమిపైకి వచ్చారు. వారు భూమిపై రక్తం చీమ్ముతూ బీభత్సం సృష్టిస్తారు. అంతేగాక ప్రపంచాన్ని సజీవ నరకంగా మారుస్తారు’’ అంటూ ఒళ్లు గగుర్పోడిచే భయానక శబ్ధంతో వినిపిస్తాయి.
previous post
హృతిక్ డాన్స్ మూవ్మెంట్స్ చూసి బెదిరిపోయాను… వాణి కపూర్