తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇక ప్రజల్లోకి వెళ్లాలని సిద్దమైనట్టు తెలుస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పర్యటించి, తండాల్లో నిద్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమంపై రాజ్ భవన్ లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ములుగులో ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్శిటీకి కేంద్ర కేబినెట్ నుంచి అనుమతులు తీసుకురావడానికి సహకరిస్తానని తెలిపారు. గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా భద్రాచలం, నాగర్ కర్నూలు నుంచి వచ్చిన కోయ, లంబాడాలతో కలిసి ఆమె నృత్యం చేశారు.
అమరావతిని దెబ్బతీయడంతో.. హైదరాబాద్ కు వలసబాట: చంద్రబాబు