మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించి అందరి దృష్టి సినిమాపై పడేలా చేసింది చిత్ర బృందం. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలలో సైరా విడుదల కానుండడంతో చిరు రీసెంట్గా ప్రమోషన్ కార్యక్రమాల కోసం ముంబై వెళ్ళారు. తమన్నాతో కలిసి మీడియా అడిగిన పలు ప్రశ్నలకి సమాధానమిచ్చారు. అంతకముందు చిత్రంలో రాజగురువు పాత్ర పోషించిన అమితాబ్ని కలిసారు చిరు. ఆ సమయంలో వారితో పాటు ఫర్హాన్ అక్తర్ కూడా ఉన్నారు. అమితాబ్, ఫర్హాన్ అక్తర్, చిరంజీవి కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Superstar Amitabh Bachchan, Megastar Chiranjeevi & Farhan Akthar promoting #SyeRaa in Mumbai. #SyeRaaNarasimhaReddy #SyeRaaOnOct2nd @SrBachchan @FarOutAkhtar @KonidelaPro @excelmovies pic.twitter.com/fnnEuCl4KP
— BARaju (@baraju_SuperHit) September 27, 2019
Megastar Chiranjeevi & Tamannah promoting #SyeRaa in Mumbai. #SyeRaaOnOct2nd #SyeRaaNarsimhaReddy #MegastarChiranjeevi @tamannaahspeaks @KonidelaPro @excelmovies pic.twitter.com/QsLMoBWTTo
— BARaju (@baraju_SuperHit) September 27, 2019
నా సోదరుడికి జగన్ అంటే ప్రాణం: పూరీ జగన్నాథ్