నల్లమల అడవులలోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్న యురేనియం తవ్వకాలపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం ధ్వంసం అవడమే కాకుండా ప్రజారోగ్యం తీవ్ర ప్రభావానికి లోనవుతుందని మేధావులు, సామాన్యప్రజలు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, అనసూయ వంటి సిని సెలబ్రిటీలు నల్లమల అడవులను కాపాడుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తాజాగా పర్యావరణ ప్రేమికురాలు సమంత.. యురేనియం తవ్వకాల నుండి నల్లమల అడవిని కాపాడండి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కోరింది. తవ్వకాలకి వ్యతిరేఖంగా వేసిన పిటీషన్లో నేను సంతకం చేశాను, మరి మీరు అంటూ నెటిజన్స్ని ప్రశ్నించింది. సమంత ప్రస్తుతం 96 తెలుగు రీమేక్లో నటిస్తుంది.
President of India: Save Nallamala Forest from Uranium Mining – Sign the Petition! https://t.co/xVNFfPwJwZ via @ChangeOrg_India I have signed this petition .. have you ?
— Samantha Akkineni (@Samanthaprabhu2) 13 September 2019