రామ్ ఇస్మార్ట్ శంకర్ 50 రోజుల పండుగ జరుపుకుంటుంది. బాక్సాఫీస్ని షేక్ చేసి ప్రేక్షకులకి మంచి ట్రీట్ అందించాడు. పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంకి మంచి ఆదరణ లభించింది. ఇన్నాళ్ళు చాలా సాఫ్ట్గా కనిపించిన రామ్ తొలి సారి మాస్ లుక్లో తెలంగాణ యాసతో అదరగొట్టాడు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్.. మార్ ముంత చోడ్ చింత అంటూ రామ్ చెప్పిన డైలాగ్స్ మాస్కి మాంచి కిక్ ఇచ్చాయి. తొలి రోజు నుండే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది.
ఇప్పటికీ ఈ చిత్రం పలు చోట్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. పూరీ జగన్నాథ్ స్టైలిష్ టేకింగ్, నభా నటేష్, నిధి అగర్వాల్ల గ్లామర్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఈ చిత్రంతో రామ్ తన కెరియర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించారు. జూలై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రం సక్సెస్ ఫుల్గా 50 రోజులు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి.