తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతలుగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచి ఫలితాలు వెలువడుతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగుర వేస్తోంది. అయితే మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె స్వగ్రామంలో మాత్రం ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. నవీపేట మండలం పోతంగల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిపై కత్రోజి రాజు (బీజేపీ) ఘన విజయం సాధించారు. ఇప్పటికే నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన కవితకు స్వగ్రామంలో టీఆర్ఎస్ ఓటమి పాలవడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు సంగారెడ్డి మండలం కొత్లాపూర్ ఎంపీటీసీగా సామేల్ (కాంగ్రెస్) విజయం సాధించారు. కంగ్టి మండలం బాబల్గామ్ ఎంపీటీసీగా రుక్కవ్వ (కాంగ్రెస్) విజయం సాధించారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం నారగూడెం ఎంపీటీసీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.ఆదిలాబాద్: బోథ్ మండలంలోని గుర్రాల తండా ఎంపీటీసీగా ఇండిపెండెంట్ అభ్యర్థి మహేందర్సింగ్ విజయం సాధించారు.