సిద్దిపేట జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల్లో విషం కలిపిన కేక్ తిని తండ్రీకొడుకులు మృతి చెందడం కలకలం రేపింది. జిల్లాలోని కొమురవెల్లి మండలం ఐనపూర్లో ఈ ఘటన జరిగింది. తండ్రి ఇస్తరిగల్లా రవి(39), అతని కుమారుడు రామ్చరణ్(9), కూతురు పూజిత(12), భార్య భాగ్యలక్ష్మి(35) నిన్న రాత్రి కొడుకు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
కేక్ తిన్న కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తండ్రి, కొడుకు చనిపోయారు. కూతురు ఐసీయూలో తల్లి జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. కాగా రామ్చరణ్ పుట్టినరోజుకు వాళ్ల బాబాయ్ కేక్ పంపించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నదమ్ముల మధ్య భూవివాదమే కారణమని గ్రామస్థులు పేర్కొంటున్నారు.