వైసీపీ పాలనపై మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. గుంటూరు అరండల్ పేటలో పల్నాడు వైసీపీ బాధితుల పునరావాస శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమ్ముంటే తనపై దాడి చేయాలని చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు. పోలీసుల సాయంతో వైసీపీ సర్కారు దారుణంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జగన్ తన తండ్రి వైఎస్ కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలేనని దుయ్యబట్టారు. టీడీపీకి ఓటేసినంత మాత్రాన గ్రామాల నుంచి వెళ్లిపొమ్మంటారా? అని నిలదీశారు. ఇప్పటివరకు ఏడుగురిని చంపేశారని, మరో 22 మందిపై దాడికి దిగారని ఆరోపించారు. కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకత్వంపైనే ఉందన్నారు. టీడీపీ హయాంలో ఇలా చేసుంటే మీరు ఉండేవాళ్లేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో రోడ్ల దుస్థితిపై సోమిరెడ్డి కామెంట్స్