“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవల విడుదలైన “సాహో” ట్రైలర్కు మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రభాస్ తన బలహీనతల గురించి మాట్లాడాడు. “నాకు మొహమాటం, బద్ధకం, జనాల్లో కలవలేకపోవడం అనే బలహీనతలున్నాయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా మారలేకపోతున్నా. ఇక, నా సినిమా విడుదలయ్యే రోజైతే చచ్చిపోయే స్టేజికి వచ్చేస్తా. హార్ట్ ఎటాక్ వచ్చేస్తుందేమో అన్నట్టు ఉంటుంది. విడుదల రోజున ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని చాలాసార్లు అనుకున్నా. `రెబల్` టైమ్లో ప్రయత్నించాను కూడా. అయితే సగం దూరం వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేశా. నా సినిమా విడుదల రోజున నేను నిద్రపోతా. సినిమా హిట్ అయితేనే నిద్ర లేపమని చెబుతా. బాహుబలి-1కు నన్ను ఎవ్వరూ నిద్రలేపలేదు. బాలీవుడ్లో బాగానే ఉంది కానీ, తెలుగులో జనాలకు నచ్చలేదన్నారు. రెండో రోజు నుంచి పరిస్థితి మారింది” అని ప్రభాస్ చెప్పాడు.
previous post
next post