telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ ఫాన్స్ ను టార్గెట్ చేసిన క్రిష్

pavan

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘బీ ది రియల్ మెన్’ ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభించింది. రాజమౌళి మొదలుకొని రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, వెంకటేష్, చిరంజీవి వరకు అందరూ ఇందులో భాగమయ్యారు. అయితే ఇప్పుడు సంగీత దర్శకులు కీరవాణి విసిరిన ఛాలెంజ్‌ను పూర్తి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్రిష్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేశారు. అందరిలా వేరే సెలబ్రిటినీ నామినేట్ చేయకుండా ఏకంగా పవన్ ఫ్యాన్స్ అందరికీ సవాల్ చేశారు. కీరవాణి ఇచ్చిన సవాల్ పూర్తి చేశాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్వీకరించాలని కోరతున్నా. ఈ ఛాలెంజ్ ద్వారా ఇంటి పనులు చేసి తమ ఇళ్లలోని ఆడవారికి సాయపడాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు క్రిష్. క్రిష్ చేసిన ఈ ఛాలెంజ్ పట్ల పవన్ ఫ్యాన్స్ పెద్దఎత్తున రియాక్ట్ అవుతూ రిప్లైలు పెడుతున్నారు. ‘‘సర్.. ఇంతవరకూ ఎవరూ ఇలా ఫ్యాన్స్‌ను నామినేట్ చేయలేదు. మీరే చేశారు. ఇక మా పవర్ ఏంటో చూపిస్తాం’’ అంటూ క్రిష్ ట్వీట్‌పై కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు సినిమాలో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడంతోనే డైరెక్టర్ క్రిష్‌తో సినిమా చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తిచేస్తూనే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో భాగమవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి.

Related posts