బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో “రూలర్” అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, త్వరలో సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్దమైంది. గతంలో బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన “జై సింహా” మంచి విజయాన్ని అందుకుంది. ఇక “రూలర్” చిత్రంలో సోనాల్ చౌహన్, వేదిక కథానాయికలుగా నటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో భూమిక చావ్లా కీలక పాత్రలో కనిపించనుందట. ఇక విలన్గా తమిళ భామ వరలక్ష్మీ శరత్ కుమార్ని తీసుకోవాలని మేకర్స్ భావించిననప్పటికి, అది వర్కవుట్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం నమిత లేడీ విలన్గా చిత్రంలో అలరించనుందని చెబుతున్నారు. ఈ వార్తే కనుక నిజమైతే సింహా తర్వాత బాలయ్య, నమిత కలిసి నటించిన మరో చిత్రం అవుతుంది. నమిత 2017లో తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో వేదమంత్రాల సాక్షిగా వీరేంద్రని వివాహం చేసుకుంది. పెళ్ళి తరువాత కూడా సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
previous post