దర్శకుడు సాహిత్ మోత్కూరి “బంధం రేగడ్” అనే ఇండిపెండెంట్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. తాజాగా జంతు నేపథ్యంలో, యూనిక్ కాన్సెప్ట్తో “సవారి” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిలింస్ పతాకాలపై సంతోశ్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నందు, ప్రియాంక శర్మ జంటగా నటించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో ఓ గుర్రంతో హీరో హీరోయిన్స్ ఉన్నారు. ఫస్ట్లుక్ టైటిల్ కు తగ్గట్టుగానే ఉంది. ఔట్ అండ్ ఔట్ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్. రా కంటెంట్తో పాటు ఎగ్జయిట్మెంట్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో గుర్రం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
previous post
తిని కూర్చొని బరువు పెరగడం లేదు : నిత్యామీనన్