చంద్రబాబు యూరప్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తాకింది. ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ఈ ప్రజా వేదికను తమకు కేటాయించాలని గతంలో జగన్కు చంద్రబాబు లేఖ రాశారు. అయితే ఈ లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రజా వేదికను స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయించింది.
టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకుని వెళ్లాలని నేతలకు సీఆర్డీయే అధికారులు సూచించారు. ఈనెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ప్రజావేదికను స్వాధీనం చేసుకోడానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సీఆర్డీయే అధికారులు ప్రజావేదిక వద్దకు వచ్చి పరిశీలించారు.
ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారు… ఇకపై అలాంటివి సాగవు: విజయసాయి రెడ్డి