వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం సరిగ్గా 12:23 గంటలకు ‘జగన్ అనే నేను..’ అంటూ వైఎస్ జగన్ ప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ముఖ్యనేతలు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకుంటున్నారు.
గురువారం ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో బయల్దేరిన డీఎంకే అధినేత స్టాలిన్ కొద్దిసేపటి క్రితమే విజయవాడ చేరుకున్నారు. ప్రస్తుతం గేట్వే హోటల్లో స్టాలిన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా ఇందిరాగాంధీ స్టేడియం అభిమానులు, కార్యకర్తలు, నేతలతో జనసంద్రంగా మారింది.