telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆత్మీయంగా పలుకరించి చికిత్స అందించాలి: మంత్రి ఈటల

Etala Rajender

రోగులను ఆత్మీయంగా పలుకరించి చికిత్స అందించాలని వైద్యులకు మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌దక్కన్‌లో ఫోర్‌ స్క్రీన్‌ సంస్థ ఆధ్వర్యంలో వైద్యరంగంలో విశిష్ట సేవలందించిన వైద్యులకు వైద్యవిభూషణ్‌ అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఈటల వైద్యులకు అవార్డులు అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్యం అందించే వారిని గుర్తించి సన్మానించడం అభినందనీయమన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడమే కాకుండా నివారణ చర్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నగరాన్ని ఉత్తమ వైద్య సేవలందించే హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దామని తెలిపారు.

Related posts