పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేతకు సంబంధించి ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “మల్లేశం”. ఈ సినిమాలో ప్రియదర్శి, అనన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని బుధవారం విడుదల చేశారు. పూర్తిస్థాయిలో తెలంగాణ మాండలికంలో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ నటించింది. ఈ చీరకు అసు పని చేసేందుకు తన తల్లి పడుతున్న శ్రమని చూసిన మల్లేశం.. ఆ శ్రమ నుంచి తప్పించుకొనేందుకు ఆసు యంత్రాన్ని కనిపెడతాడు. ఈ అంశాన్నే ప్రధాన కథనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మల్లేశం పాత్రలో ప్రియదర్శ ఒదిగిపోయాడు. ఇక దర్శి, అనన్యల మధ్య చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు, ఆసు యంత్రాన్ని కనిపెడున్న సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చివర్లో “అసలు కథ మొదలైంది ఇప్పుడే.. ముందుంది ముసళ్ల పండుగ” అంటూ దర్శి చెప్పిన డైలాగ్ ట్రైలర్కు హైలైట్గా నిలిచింది.
రాజ్.ఆర్ దర్శక, నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజ్తో పాటు.. శ్రీ అధికారి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని సురేశ్ ప్రొడెక్షన్ బ్యానర్పై విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో చక్రపాణి, తాగుబోతు రమేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తుండగా.. గొరేటి ఎంకన్న, చంద్రబోస్, దాశరథి లిరిక్స్ అందించారు. ఈ సినిమా 21న విడుదల కానుంది.
previous post
next post


నాగశౌర్యను మెగా హీరోలు తోక్కేస్తున్నారు… హీరోయిన్ వ్యాఖ్యలు