బంగారు తెలంగాణయే తన లక్ష్యమని నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత అన్నారు. జిల్లాలో ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబాన్ని కవిత ఇవాళ పరామర్శించారు. కిశోర్ మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. కిషోర్ కుటుంబానికి అండగా ఉంటామని కవిత స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కిశోర్ కుటుంభానికి అండగా ఉంటుందని తెలిపారు. ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దని కిశోర్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని మాజీ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం అన్నారు. తాను నిజామాబాద్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి కవిత ఓటమి పాలైన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలుపొందారు.