telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇదేనా మీరు తెస్తానన్న రాక్షస రాజ్యం: నారా లోకేశ్

Minister Lokesh comments YS Jagan

తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేత నారా లోకేశ్‌ పర్యటించిన నేపథ్యంలో వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ‘మమ్మల్ని అడ్డుకొనే పనిలో భాగంగా వైకాపా రౌడీలు మీడియా ప్రతినిధుల పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

నా ప్రజా చైతన్యయాత్ర కవరేజ్ కి వచ్చి వెళ్తున్న మీడియా ప్రతినిధుల పై విచక్షణారహితంగా దాడి చేసి, జర్నలిస్టు మిత్రుల కాలు విరగ్గొట్టిన ఘటన నన్ను తీవ్రంగా బాధించింది’ అని చెప్పారు. ఈ క్రమంలో జర్నలిస్టు మిత్రుల కాలు విరగ్గొట్టారని లోకేశ్ చెప్పారు.కక్ష సాధింపే లక్ష్యంగా, రౌడీయిజమే ఊపిరిగా ముందుకి వెళ్లాలనుకుంటే మీ ఇష్టం జగన్ గారు. కానీ మీడియా ప్రతినిధులేం చేశారు?’ అని ప్రశ్నించారు. ‘ఇదేనా మీరు తెస్తానన్న రాక్షస రాజ్యం అని ప్రశ్నించారు.

Related posts