ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ మతప్రబోధకుడు కేఏ పాల్ ఏపీ కాబోయే సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్ మాట్లాడుతూ నవరత్నాలు పేరిట హామీ ఇచ్చిన జగన్ ఆ హామీని నిలబెట్టుకుంటాడో లేదో చూస్తానని అన్నారు. జగన్ మాట నిలబెట్టుకుంటాడనే ఆశిస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కేసీఆర్ ను సపోర్ట్ అడిగారు, కేసీఆర్ ను ఇమ్మనండి స్పెషల్ స్టేటస్ అని దుయ్యబట్టారు.
మోదీని కూడా వెళ్లి కలిశాడు, మోదీ స్పెషల్ స్టేటస్ ఇస్తాడు తీసుకోమను అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దేశాధినేతలతో పరిచయాలు కావాలన్నా, బిలియనీర్లు రావాలన్నా తనను సపోర్ట్ అడగాలని కేఏ పాల్ జగన్ కు సూచించారు. జగన్ అడగనిదే తానేం చేయగలనని పాల్ వ్యాఖ్యానించారు. జగన్ తనను ప్రమాణస్వీకారానికి పిలవలేదని, పిలిస్తే వెళ్తానని అన్నారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే షర్మిల వివాదం