ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని రనిప్లోని నిశన్ హయ్యర్ సెకండరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో మోదీ తన ఓటువేశారు. అంతకు ముందు గాంధీనగర్లోని తన మాతృమూర్తి నివాసానికి ప్రధాని వెళ్లారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ప్రధాని ఓటు వేయడానికి వెళ్లారు.
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో మూడో విడుత పోరుకు ఓటింగ్ కొనసాగుతోంది. 13 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 117 లోక్సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తదితర ప్రముఖులు మూడో విడుత బరిలో ఉన్నారు.
కనగరాజ్ను క్వారంటైన్ కు పంపించాలి: వీహెచ్