telugu navyamedia
క్రీడలు వార్తలు

షారుఖ్ ను ప్రశంసించిన ప్రీతి జింటా…

పంజాబ్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షారుఖ్ ఖాన్ నిన్న ముంబై వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున టాప్ స్కోరర్. 19 పరుగులకు నాలుగు వికెట్లను కోల్పోయి.. ఏ మాత్రం కోలుకోలేని దశలో క్రీజ్‌లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ భారీ స్కోర్ సాధించాడు. 36 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 47 పరుగులు చేశాడు. అనుభవజ్ఞులైన బౌలర్లను సైతం అలవోకగా ఆడిపడేశాడు. మూడు పరుగుల తేడాతో తొలి అర్ధసెంచరీని మిస్ చేసుకున్నాడు. అయితే అతని బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ కో ఫ్రాంఛైజీ ప్రీతి జింటాను కట్టి పడేశాయి. దాంతో అతణ్ని ప్రశంసించకుండా ఉండలేకపోయిందామె. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఓ కొత్త స్టార్ ఆవిర్భవించాడంటూ ప్రీతిజింతా వ్యాఖ్యానించారు. ఈ రాత్రి తమది కానప్పటికీ.. జట్టులో కొన్ని పాజిటివ్ సంకేతాలు కనిపించాయని ఆమె కామెంట్స్ చేశారు. అత్యంత ప్రతికూల, ఒత్తిడిపూరక వాతావరణంలో షారుఖ్ ఖాన్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని అన్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పోల్చుకుంటే.. ఈ మ్యాచ్‌లో బౌలర్లు రాణించడం సంతోషాన్నిస్తోందని తెలిపింది.

Related posts