గ్రేటర్ హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ దుకాణం ఇక బంద్ అయినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాదులోని ఏకైక టీడీపి కార్పోరటర్ మందాడి శ్రీనివాస రావు గులాబీ గూటికి చేరాడు. కూకట్ పల్లి శాసనసభ్యుదడు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. శనివారం నంది నగర్ లోని ఆయన నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రేటర్ హైదరాబాదులో ఉన్న ఒకే ఒక్క టీడీపీ కార్పోరేటర్ కరెక్కడంతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
previous post
next post
చంద్రబాబు సెక్యూరిటీ పై స్పందించిన డీజీపీ