ఏపీ మంత్రి పెడ్డిరెడ్డి కేసులను ప్రభావితం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. పెద్దిరెడ్డి ఒత్తిడితోనే జడ్జి రామకృష్ణను ఇంటి నుంచి బయటకు రాకుండా 145 ప్రొసీడింగ్ ఇచ్చారని మండిపడ్డారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే జడ్జి రామకృష్ణకే న్యాయం జరగడం లేదంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
రామకృష్ణ పెట్టిన కేసులను కూడా తన అధికారంతో పెద్దిరెడ్డి ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.ఎన్నో ఆరోపణలు వస్తున్న పెద్దిరెడ్డిని ఇంకా పదవిలో కొనగించడం ఏమిటని ప్రశ్నించారు. కొంతకాలం పాటు ఆయనను అధికారానికి దూరం చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు. వీటన్నిటి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.