ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో క్లౌడ్ సెక్యూరిటీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
కేంద్రం ఇచ్చే నిధులతో రూ.194.60 కోట్ల వ్యయంతో తిరుపతిలో ఈ డేటా సెంటర్ (స్టేట్ డిజాస్టర్ రికవరీ సెంటర్) ఏర్పాటు చేయనున్నారు.
రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన డేటా సెంటర్ ఉంది.
ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్లో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వానికి సంబంధించిన సేవలు ఆగిపోకుండా తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.
దీనిని బ్యాకప్గా వినియోగిస్తారు. కొత్త డేటా సెంటర్ సొంతంగా ఉంటే ఈ-ఆఫీస్ అప్లికేషన్లు, ప్రభుత్వ వెబ్సైట్లు కూడా సురక్షితంగా ఉంటాయి.
తిరుపతిలో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ ప్రభుత్వ శాఖలతో పాటుగా ఆ పక్కనే ఉన్న శ్రీసిటీతో పాటూ ఇండస్ట్రియల్ ఏరియాలో కంపెనీలకు సేవలు అందించొచ్చు.
అంతేకాదు ఈ డేటా సెంటర్ ఏర్పాటైతే స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు.
ఈ డేటా సెంటర్ ప్రాజెక్టు బూట్ మోడల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కీ ద్వారా నిధులు సమకూరుస్తారు. మొత్తం ప్రాజెక్ట్ విలువ రూ.194.60 కోట్లుగా ఉంది.
ప్రతి ఏటా నిర్వహణకు రూ.30.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ డేటా సెంటర్ను తిరుపతిలోని రేణిగుంట రోడ్లో ఉన్న ఐటీ పార్క్ (ఐఐడీటీ క్యాంపస్) ఏర్పాటు చేయనున్నారు.


ఈ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బే తగిలింది: నారా భువనేశ్వరి