మే 13న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు సీనియర్ బీజేపీ నేతలు – ఎం రఘునందన్ రావు, డీకే అరుణ, ఈటల రాజేందర్ వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే రావు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీచేస్తునారు.
మరియు మాజీ ఎమ్మెల్యే అయిన రాజేందర్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీచేస్తునారు.
కుటుంబ పెద్దల ఆశీర్వాదం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రావు, అరుణ, రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు.
స్థానిక నాయకులు, కార్యకర్తల మద్దతుతో నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు తమ నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకునే ముందు వేర్వేరుగా ర్యాలీలు చేపట్టారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఎన్నికల ర్యాలీలో రాజేందర్తో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని మెజారిటీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ఏ పార్టీకి బీజేపీ ‘బీ’ టీమ్ కాదని మరోసారి స్పష్టం చేశారు.