ఎంఎం కీరవాణి. ఆస్కార్ అవార్డు గ్రహీత సినీ సంగీత ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ ఆర్ ఆర్ తో తెలుగు సినిమా సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు.
గీత రచయిత అందెశ్రీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ కీరవాణి తదితరులు తో పాటు రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
అందెశ్రీ రాసిన గీతం జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అంటూ సాగుతుంది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసేలా, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపేలా అందెశ్రీ రచించారు.
అత్యంత ప్రజాదరణ పొందిన ఈ గీతాన్ని ఇదివరకే రాష్ట్ర గేయంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర వేడుకలు, తెలంగాణ లిబరేషన్ డే సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ జాతీయ గీతంతో పాటు ఈ పాటను వినిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను కీరవాణికి అప్పగించారు రేవంత్ రెడ్డి. దీనిపై తాజాగా జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన జీవో విడుదల చేయనున్నారు.
వైసీపీ సర్కారు వైఖరితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు: సోమిరెడ్డి